Advertisement

  • స్విమ్స్ ఆసుపత్రి ప్రమాదంలో మరణించిన బాధితురాలి కుటుంబానికి పది లక్షల పరిహారం

స్విమ్స్ ఆసుపత్రి ప్రమాదంలో మరణించిన బాధితురాలి కుటుంబానికి పది లక్షల పరిహారం

By: Sankar Mon, 05 Oct 2020 8:51 PM

స్విమ్స్ ఆసుపత్రి ప్రమాదంలో మరణించిన బాధితురాలి కుటుంబానికి పది లక్షల పరిహారం


తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో మృతురాలి కుటుంబానికి 10లక్షలు, గాయపడిన వారికి 2లక్షలు ఆర్ధిక సహాయం చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో తక్షణమే మృతి చెoదిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు.

తన చేతులతో ఎందరో కొవిడ్ రోగులకు సేవలందించి బ్రతికించిన అటెండర్ రాధిక అకారణంగా అదే ఆస్పత్రిలో తుదిశ్వాస విడించింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి కోవిడ్ సెంటర్ లో బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి రాధిక అనే అటెండర్ అక్కడిక్కడే చనిపోయింది. మరో ఇద్దరు కోవిడ్ రోగులు పాజిటివ్ రావడంతో బ్రతుకు జీవుడా అంటూ ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన బాధితులు రక్తమోడుతున్న గాయాలతో బెడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.

గత రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.అయితే ప్రమాదంలో మృతి చెందిన రాధిక జీవితం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాధిక...ఆమెభర్త హరికుమార్‌ ఎమ్‌ఎన్వోగా స్విమ్స్‌లోనే పదేళ్లకు పైగా పనిచేస్తున్నారు.

Tags :
|

Advertisement