Advertisement

  • కుమార్తెను పైచదువులకోసం విదేశాలకు పంపించేందుకు బెంగుళూరు వెళ్లనున్న ఏపీ సీఎం

కుమార్తెను పైచదువులకోసం విదేశాలకు పంపించేందుకు బెంగుళూరు వెళ్లనున్న ఏపీ సీఎం

By: Sankar Tue, 25 Aug 2020 2:52 PM

కుమార్తెను పైచదువులకోసం విదేశాలకు పంపించేందుకు బెంగుళూరు వెళ్లనున్న ఏపీ సీఎం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం బెంగళూరు వెళుతున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బెంగళూరుకు బయల్దేరి.. సాయంత్రం 4.30కి బెంగళూరులోని నివాసానికి చేరుకుంటారు. జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో సీటు వచ్చిన సంగతి తెలిసిందే.. తన కుమార్తెను పారిస్‌ పంపించేందుకు బెంగళూరు వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ తిరిగి 27న తాడేపల్లి చేరుకోనున్నారు.

ప్రపంచంలోని టాప్‌ 5 బిజినెస్‌ స్కూల్స్‌లో ఒకటైన ఇన్సీడ్‌లో సీఎం జగన్ పెద్ద కుమార్తె ‌హర్షారెడ్డికి సీట్ వచ్చింది. ఇప్పటికే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయగా.. ఆ తర్వాత అమెరికాకు చెందిన ఎంఎన్‌సీలో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా ఆఫర్ వచ్చింది.. కానీ దానిని వదులుకుని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మాస్టర్స్‌ చేయాలని నిర్ణయించారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్‌ సాధించారు. కుమార్తె కోసం దాదాపు ఐదు నెలల తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రం దాటబోతున్నారు.

Tags :
|
|
|
|

Advertisement