ఢిల్లీ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్..!
By: Anji Tue, 22 Sept 2020 2:22 PM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి బయలుదేరారు. దేశ రాజధానిలో కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సహా.. పలువురు కేంద్ర మంత్రులను సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. ఆ తర్వాత రాత్రి ఢిల్లీలో బస చేయనున్నారు. బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు.
బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొంటారు.
Tags :
ap cm |
tirupati |