Advertisement

పోలవరంపైనే చర్చ ..అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ

By: Sankar Wed, 16 Dec 2020 09:08 AM

పోలవరంపైనే చర్చ ..అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ


ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు..

సుమారు గంటపాటు షాతో కీలక చర్చలు జరిపారు ఏపీ సీఎం... ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపైనే చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సవరించిన అంచనాలను ఆమోదించాల్సిందిగా కోరినట్టు సమాచారం.. వరుస తుఫాన్లతో నష్టపోయిన ఏపీకి వరద సాయాన్ని విడుదల చేయాలని కోరారు..

ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై కూడా అమిత్‌షాతో సీఎం వైఎస్ జగన్‌ చర్చించినట్టు తెలుస్తుండగా... ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే మకాం వేయనున్న ఏపీ సీఎం.... రేపు మరికొంతమంది కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు

Tags :
|
|

Advertisement