Advertisement

  • ఏలూరు లో పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏలూరు లో పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

By: Sankar Tue, 08 Dec 2020 8:25 PM

ఏలూరు లో పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్


వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు లో వింత వ్యాధి బారిన పడి అనేక మంది ఆసుపత్రి పాలుఅవుతున్న విషయం తెలిసిందే..అసలు ఆ వ్యాధి ఎందుకు వస్తుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు..తాజాగా ఆ పరీక్షలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు...

ఇప్పటివరకూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సీఎంకు వివరించారు. అస్వస్థతకు గురైన వారికి ఎయిమ్స్‌ వైద్య నిపుణుల బృందం నిర్వహించిన పరీక్షల్లో సీసం, నికెల్‌ లాంటి మూలకాలు ఉన్నట్టుగా తెలుస్తోందని మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఐఐసీటీ కూడా పరీక్షలు చేస్తోందని ఆ వివరాలు కూడా త్వరగా వస్తాయని వెల్లడించారు..

బాధితులకు నిర్వహించిన పరీక్షలు, అలాగే ఆ ప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షలు.. వీటన్నింటి ఫలితాలను ఓ నివేదిక రూపంలో పొందుపరచి తనకు ఇవ్వాలని, దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌కూడా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు

Tags :
|
|

Advertisement