ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై దృష్టి సారించాలి ...ఏపీ సీఎం జగన్
By: Sankar Tue, 22 Dec 2020 9:25 PM
తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలు సంచలనం రేపుతున్నాయి..తెలంగాణాలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలు వీటిని సీరియస్ గా తీసుకున్నాయి...
దీనితో ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆన్లైన్ కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాల్ మనీ వ్యవహారాలను ఉపేక్షించేది లేదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు..
మొబైల్ లోన్ యాప్లపై ఏపీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు చేపడుతున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మైక్రో ఫైనాన్స్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. మొబైల్ లోన్ యాప్లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయని వెల్లడించారు. మొబైల్ లోన్ యాప్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.