Advertisement

  • తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్...!

తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్...!

By: Anji Mon, 21 Sept 2020 09:26 AM

తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్...!

ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలో ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని అంతర్రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఉపాధి పనుల నిమిత్తం ఏపీ నుంచి తెలంగాణకు వలస వెళ్లిన పేదలకు అంతర్రాష్ట్ర పోర్టబిలిటీతో సరుకులు ఇస్తున్నారు. ఈ విధానం ఎంతో ప్రయోజనం కలిగిస్తుండగా.. కేంద్రం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఒక క్లస్టర్‌గా గుర్తించి ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా అమలైతే దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో రేషన్‌ కార్డులున్న 349 మంది తెలంగాణలో బియ్యంతో పాటు ఇతర సరుకులు తీసుకున్నారు. ఇటు రాష్ట్రంలో ఆదివారం రోజు 12వ విడత ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభమైంది.

తొలి రోజు 9.76 లక్షల మంది ఉచిత సరుకులు పొందారు. అంతర్‌ జిల్లాల పోర్టబిలిటీ ద్వారా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందిన 1.34 లక్షల మంది బియ్యంతో పాటు శనగలు ఉచితంగా తీసుకున్నారు. ఈ విడతలో 1,50,80,690 బియ్యం కార్డుదారులకు ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున శనగలు కేటాయించారు

Tags :
|

Advertisement