Advertisement

  • దివ్య కుటుంబ సభ్యులకు పది లక్షల ఆర్థిక సాయం చేసిన సీఎం జగన్

దివ్య కుటుంబ సభ్యులకు పది లక్షల ఆర్థిక సాయం చేసిన సీఎం జగన్

By: Sankar Thu, 22 Oct 2020 7:46 PM

దివ్య కుటుంబ సభ్యులకు పది లక్షల ఆర్థిక సాయం చేసిన సీఎం జగన్


విజయవాడలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో వారి కుటుంబాన్ని అందుకుంటాను అని మాట ఇచ్చిన సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు..రెండు రోజుల్లోనే విజయవాడ ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్‌ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు.

ప్ర‌భుత్వం త‌ర‌పున విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దివ్య కుటుంబ‌స‌భ్యుల‌కు ప‌ది ల‌క్ష‌లు చెక్కును అంద‌జేశారు. తమకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రికి తేజస్విని కుటుంబ సభ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు.

సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌హాయం మ‌ర‌వ‌లేనిద‌ని దివ్య త‌ల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ అన్నారు. తమ బాధను విని సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ధైర్యాన్ని ఇచ్చార‌ని.. ఆరోజు నుంచీ ఈరోజు వరకూ అందరూ అండగా ఉన్నారన్నారు. ఆర్థిక సహాయం చేస్తారని ఊహించలేదని.. తమ కుటుంబ పరిస్థితులు అర్ధం చేసుకొని సహాయం చేసిన సీఎం జ‌గ‌న్‌కి రుణపడి ఉంటామ‌న్నారు. ఈ కేసులో త‌మ బిడ్డ‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.


Tags :
|
|
|

Advertisement