Advertisement

  • సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సలాం కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ సీఎం జగన్

సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సలాం కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ సీఎం జగన్

By: Sankar Fri, 20 Nov 2020 6:23 PM

సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సలాం కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ సీఎం జగన్


ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌, నంద్యాలలో ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్తగారు మాబున్నీసాతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆమె కొడుకు, శంషావలి, కూతురు సాజీదాలను తిరుగు ప్రయాణంలో ఏపీఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద సీఎం జగన్ పరామర్శించారు. సలాం కుటుంబం ఆత్మహత్య కు కారకులైన దోషులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి అండగా ఉంటామని సలాం అత్త మాబున్నీసాకు ధైర్యం చెప్పి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి ఇటీవల 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఈ సందర్భంగా మాబున్నీసా కుమార్తె షాజిదాకు ఔట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఆమె అల్లుడు శంషావలిని అనంతపురం నుంచి నంద్యాలకు బదిలీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు..ఈ సందర్భంగా మాబున్నీసా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎంకు రుణపడి ఉంటామని కృతజ్ఞతాభావం చాటుకున్నారు

Tags :
|
|
|

Advertisement