Advertisement

  • మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో కీలక పరిణామణం

మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో కీలక పరిణామణం

By: Dimple Mon, 17 Aug 2020 11:50 PM

మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో కీలక పరిణామణం

ఏపీలో మూడు రాజ‌ధానుల వ్యవ‌హారంపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల రద్దుపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ‌ను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామం చేసుకుంది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వేరే బెంచ్ ముందు లిస్ట్ చేయాలని సూచించింది.
ఎందుకంటే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్తె రుక్మిణీ బాబ్డే.. హైకోర్టులో పిటిషనర్ రైతుల తరుఫున వాదనలు వినిపించారు.. దీంతో వేరే బెంచ్‌కు బ‌దిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం నిర్ణయం తీసుకుంది.. ఈ కేసును సుప్రీం కోర్టులోని వేరే ధర్మాసనం ముందు బుధవారం విచారణ జ‌ర‌గ‌నుంది.
కాగా, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు “స్టేటస్ కో” ఇచ్చింది.. సీఆర్డీఏ ర‌ద్దు, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుల‌ను ఈ మధ్యే ఆమోదించారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. అయితే, వెంటనే అమరావతి రైతులు ఆ బిల్లుల అమలుపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రీకరణ అంశాలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది.
దీన్ని రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మ‌రోవైపు, రాజ‌ధాని పిటిష‌న్లపై గ‌త వారం విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది. ఇక‌, సోమవారమే సీజే నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టినా.. మ‌రో బెంచ్‌కు కేసును బ‌దిలీ చేస్తూ విచార‌ణ‌ను బుధ‌వారానికి వాయిది వేసింది.

Tags :
|
|

Advertisement