Advertisement

  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం...!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం...!

By: Anji Fri, 27 Nov 2020 7:07 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం...!

ఏపీని ‘నివర్ తుఫాను’ ముంచెత్తుతున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. 27 అంశాలతో ఈ కేబినేట్ సమావేశం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ ఏపీని ‘నివర్ తుఫాను’ ముంచెత్తుతున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. 27 అంశాలతో ఈ కేబినేట్ సమావేశం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 289 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపాడు. పదివేల మందికి పైగా సహాయక శిబిరాలకు తరలింపు చేపట్టామని.. 30 వేల హెక్టార్టలో వ్యవసాయ పంటలు, 1300 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందన్నారు.

శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 నగదు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారని కన్నబాబు తెలిపారు. డిసెంబర్ 15 కల్లా పంట నష్టం అంచనాల రూపకల్పన చేసి, డిసెంబర్ 30 కల్లా పరిహారం చెల్లింపులు చేస్తామన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 289 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపాడు. పదివేల మందికి పైగా సహాయక శిబిరాలకు తరలింపు చేపట్టామని.. 30 వేల హెక్టార్టలో వ్యవసాయ పంటలు, 1300 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందన్నారు.

శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 నగదు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారని కన్నబాబు తెలిపారు. డిసెంబర్ 15 కల్లా పంట నష్టం అంచనాల రూపకల్పన చేసి, డిసెంబర్ 30 కల్లా పరిహారం చెల్లింపులు చేస్తామన్నారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై వార్తల్ని ఖండించింది కేబినెట్‌. పోలవరం ప్రాజెక్టు ఎత్తు సెంటీమీటర్‌ కూడా తగ్గదని సీఎం జగన్‌ తేల్చిచెప్పేశారు. వాస్తవ డిజైన్‌ల ఆధారంగానే పోలవరం నిర్మాణం ఉంటుందన్నారు.

ఉద్యోగులు, పింఛన్‌దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విడతల వారిగా 3 డీఏల చెల్లింపునకు ఆమోదం, 2021 జనవరి నుంచి వర్తిస్తాయి. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించింది.C
కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోత డిసెంబర్‌, జనవరి నెలలో చెల్లింపు చేస్తామన్నారు. డిసెంబర్‌ 25న 30 లక్షల 60 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయనుంది ప్రభుత్వం. 175 నియోజకవర్గాల్లో డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కోర్టు స్టేలు ఉన్న ప్రాంతాల్లో తర్వాతి దశలో ఇళ్ల పట్టాల పంపిణీకి నిర్ణయం. ఇళ్ల నిర్మాణం చేసుకునే వారికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్‌ 15న రైతులకు రూ.1227 కోట్లతో పంట బీమా పథకం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ క్రాప్‌ బుకింగ్‌లో రైతులు బీమా చేసుకున్న పంటలకు ఉచితంగానే ఇన్సూరెన్స్‌ ప్రయోజనం ఉంటుంది. డిసెంబర్ 2 తేదీన ఏపీ-ఆముల్ ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

Tags :

Advertisement