Advertisement

తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండిల సమావేశం నేడే...

By: Sankar Mon, 02 Nov 2020 07:53 AM

తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండిల సమావేశం నేడే...


కరోనా నిబంధనల్లో సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు అనేకమార్లు చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం కాలేదు.

అయితే..తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసుల ప్రతిష్టంభన తొలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య సర్వీసుల పునరుద్ధరణపై తిరిగి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ హైదరాబాద్ లో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీలు సమావేశం కానున్నారు. అంతరాష్ట్ర ఒప్పందంపై రెండు రాష్ట్రాల అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య 1.60లక్షల కి.మీ మేర బస్సులు తిప్పాలని అంగీకారం కుదిరిన నేపథ్యంలో...రూట్ల వారీగా తిప్పే ప్రతిపాదనలపై ఇవాళ్టి భేటిలో చర్చించే అవకాశముంది. ఒప్పందం కుదిరితే వెంటనే బస్సులు తిప్పేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే సిద్ధమైంది.

Tags :
|
|

Advertisement