Advertisement

  • అనుష్క ‘నిశ్శబ్దం’చిత్ర నిర్మాతలకు అనుకోని షాక్...

అనుష్క ‘నిశ్శబ్దం’చిత్ర నిర్మాతలకు అనుకోని షాక్...

By: chandrasekar Thu, 08 Oct 2020 1:27 PM

అనుష్క ‘నిశ్శబ్దం’చిత్ర నిర్మాతలకు అనుకోని షాక్...


మిస్టరీ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. అనుష్క శెట్టి, మాధవన్, సుబ్బరాజు, షాలిని పాండే, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. విమర్శకులైతే తక్కువ మార్కులే ఇచ్చారు. సినిమా సంగతి ఎలా ఉన్నా అనుష్క నటనను మాత్రం అందరూ మెచ్చు కున్నారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా చిత్ర యూనిట్ అయితే ‘నిశ్శబ్దం’ను ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉంది. సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తోన్న ఈ సమయంలో చిత్ర నిర్మాతలకు అనుకోని షాక్ తగిలిందట.

ఈ సినిమా అమెజాన్ లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఓ కేబుల్ ఛానల్ ప్రసారం చేసేసిందని సమాచారం. ఈ విషయం నిర్మాతల దృష్టికి వెళ్లడంతో ఆ కేబుల్ ఛానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాతలు వారికి లీగల్ నోటీస్ పంపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఆ కేబుల్ ఛానల్‌ను డ్యామేజ్ ఛార్జెస్ కింద నిర్మాతలు రూ.1.1 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ సైతం మరో రూ.30 లక్షలు డిమాండ్ చేస్తుందట. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించగా దాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ రీట్వీట్ చేశారు. అంటే, ఈ వార్తలో ఖచ్చితంగా నిజం ఉంది. మరి ఇంత మొత్తాన్ని ఆ కేబుల్ ఛానల్ కడుతుందో లేదంటే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు.

Tags :
|

Advertisement