Advertisement

విరాట్‌ ఆరోగ్యం గురించి అనుష్క కేర్

By: chandrasekar Thu, 09 July 2020 11:18 AM

విరాట్‌ ఆరోగ్యం గురించి అనుష్క కేర్


ఇంట్లో చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదిస్తూ సమయాన్ని గడుపుతున్నారు అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ దంపతులు. అయితే సోషల్‌మీడియాలో వారి పోస్టులు చూస్తుంటే ఇద్దరు కలిసి వంట చేసుకుంటారని తెలుస్తుంది. తాజాగా అనుష్క చేసిన పోస్టు చూస్తే విరాట్‌ ఆరోగ్యం గురించి ఆమె ఎంతగా ఆలోచన చేస్తుందో తెలుస్తుంది.

వంటగదిలో ఒక చిన్న బరువును కొలిచే మిషన్‌పై పోహా రైస్‌ ను పెట్టి అది 100 గ్రా. ఖచ్చితమైన బరువుకు వచ్చే వరకు కొంత వేస్తూ తీస్తూ ఆహారాన్ని జోకుతున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో అనుష్క షేర్‌ చేసింది. అంతే కాకుండా ‘‘ఈ ఇంట్లో తినే తిండిని కొలుస్తారు’’ అంటూ నవ్వుతున్న ఎమోజీతో పాటు హార్ట్‌ సింబల్‌ను ఉంచింది. అదే విధంగా విరాట్‌ కొహ్లి ఇంటికి దగ్గరలోనే ఉండే క్రికెటర్‌ శ్రేయాస్ అయ్యర్ ఇంట్లో తయారు చేసిన దోశలను తనకు తెచ్చి ఇచ్చినట్లు విరాట్‌ ఇన్‌స్టా ద్వారా తెలియజేశాడు

“మా ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో నివసించే ఒక పొరుగు వ్యక్తి నీర్ దోశలను మా ఇంటికి తీసుకొచ్చాడు. నీకు మరియు మీ అమ్మగారికి ధన్యవాదాలు. ఇంత రుచికరమైన దోశలను తిని చాలా కాలం అయ్యింది. మేము తిరిగి పంపిన పుట్టగొడుగు బిర్యానీని మీరు ఆస్వాదించాలని ఆశిస్తున్నాం’’ అని విరాట్‌ శ్రేయాస్‌తో భౌతిక దూరం పాటించే ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.

లాక్‌డౌన్‌లో వారు గడుపుతున్న సమయం గురించి విరాట్ ఇటీవల ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ఇలా అన్నాడు. “మేము వివాహం చేసుకున్నప్పటి నుంచి ఒకే చోట కలిసి గడిపిన కాలం ఇది. మేము ఒకే సమయంలో ఇంతకాలం ఒకే చోట లేము. ఇది నిజంగా వింతే. సమయాన్ని గడపడానికి ఇది ఒక అవకాశంగా చెప్పలేను కానీ ఇది అలాంటిదే అని భావిస్తున్నా. మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం’’ అని విరాట్‌ చెప్పారు.

Tags :
|
|
|

Advertisement