లైంగిక ఆరోపణలపై విచారణకు హాజరయిన స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్
By: Sankar Thu, 01 Oct 2020 10:59 AM
హీరోయిన్ పాయల్ ఘోష్ ను లైన్గికంగా వేధించాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇవాళ ముంబైలో పోలీసు స్టేషన్ ముందు హాజరయ్యారు. వెర్సోవా పోలిస్ స్టేషన్కు వెళ్లిన కశ్యప్ విచారణను ఎదుర్కొననున్నారు..
అనురాగ్ కశ్యప్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని నటి పాయల్ ఘోష్ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని కలిసి తాజా పరిస్థితుల నేపథ్యంలో తనకు వై కేటిగిరీ భద్రతను కల్పించాలని ఆమె గవర్నర్ ను కూడా కోరారు. ఈ మేరకు గవర్నర్ కు ఓ లేఖ కూడా అందజేసింది పాయల్ ఘోష్. లైంగిక దాడికి సంబంధించి ఆరోపణల కింద అనురాగ్ కశ్యప్కు బుధవారం ముంబై పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు.
రేప్ ఆరోపణలపై నిన్ననే కశ్యప్ స్పందించారు. తను అలాంటి వాడిని కాదని, కావాలనే పాయల్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఇటీవల అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. ఆయనకు వర్మతో పాటు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు పాయల్కు కూడా సినీ ప్రముఖులే కాక రాజకీయ నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారు.