Advertisement

బోజ్‌పురి న‌టి అనుప‌మ పాఠ‌క్ ఆత్మ‌హ‌త్య‌

By: chandrasekar Fri, 07 Aug 2020 11:36 AM

బోజ్‌పురి న‌టి అనుప‌మ పాఠ‌క్  ఆత్మ‌హ‌త్య‌


బోజ్‌పురి న‌టి అనుప‌మ పాఠ‌క్ (40) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం అభిమానులని తీవ్ర విషాదంలోకి నెట్టివేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం మ‌రువ‌క ముందే ముంబైలో మ‌రో విషాద‌ఘ‌ట‌న వెలుగుచూసింది.

ఆగ‌స్టు 2న ద‌హిసార్ లోని త‌న అపార్టుమెంట్ లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు స్థానిక మీడియా వెల్ల‌డించింది. ఆత్మ‌హ‌త్యకు ఒక రోజు ముందు అనుప‌మ పాఠ‌క్ ఫేస్ బుక్ లైవ్ లో కొన్ని విష‌యాలు షేర్ చేసుకుంది. అంతేకాదు రెండు కార‌ణాల వ‌ల్ల ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు సూసైడ్ నోట్ లో పేర్కొంది.

ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ తో మ‌ల‌ద్ లోని విస్డ‌మ్ ప్రొడ్యూస‌ర్ కంపెనీలో నేను రూ.10 వేలు పెట్టుబ‌డి పెట్టాను. నిబంధ‌న‌ల ప్ర‌కారం డిసెంబ‌ర్ 2019లో ఆ కంపెనీ రావాల్సిన డ‌బ్బును తిరిగి ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వ‌కుండా కంపెనీ ఇబ్బంది పెడుతోంద‌ని రాసింది.

లాక్ డౌన్ కొన‌సాగుతున్న‌పుడు మ‌నీశ్ ఝా అనే వ్య‌క్తి త‌న టూవీల‌ర్ వెహికిల్ తీసుకొని ఇప్ప‌టివ‌ర‌కు తిరిగివ్వ‌డం లేద‌ని ఆరోపించింది. ఎవ‌రినీ న‌మ్మ‌కూడ‌ద‌ని త‌న ఆవేద‌నను 10 నిమిషాల నిడివి గ‌ల వీడియోలో షేర్ చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Advertisement