Advertisement

  • ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక ప‌రీక్షించిన యాంటీ షిప్ మిస్సైల్‌

ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక ప‌రీక్షించిన యాంటీ షిప్ మిస్సైల్‌

By: chandrasekar Sat, 31 Oct 2020 3:44 PM

ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక ప‌రీక్షించిన యాంటీ షిప్ మిస్సైల్‌


హైద‌రాబాద్‌: క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌తో భార‌తీయ నౌకాద‌ళం త‌న స‌త్తా ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది. తాజాగా ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక నుంచి యాంటీ షిప్ మిస్సైల్‌ను ప‌రీక్షించారు. గ‌రిష్ట దూరంలో ఉన్న టార్గెట్‌ను అత్యంత ఖచ్చిత‌త్వంతో పేల్చేశారు. ఈ ప‌రీక్ష బంగాళాఖాతంలో జ‌రిగింది. టార్గెట్ షిప్ తీవ్రంగా ధ్వంస‌మైంద‌ని, ఆ నౌక నుంచి మంట‌లు వ్యాపించిన‌ట్లు నౌకాద‌ళ ప్ర‌తినిధి త‌న ట్వీట్‌లో తెలిపారు. ఐఎన్ఎస్ కోరాను 1998లో క‌మిష‌న్ చేశారు.

ప్రాజెక్టు 24ఏ కింద ఈ యుద్ధ‌నౌక‌ను డిజైన్ చేశారు. కేహెచ్‌-35 యాంటీ మిస్సైళ్లను ఇది ప్ర‌యోగించ‌గ‌ల‌దు. ఐఎన్ఎస్ కోరాతో పాటు ఐఎన్ఎస్ కిర్చి, ఐఎన్ఎస్ కులిష్‌, ఐఎన్ఎస్ కార్ముక్ యుద్ధ నౌక‌లు భార‌త్ వ‌ద్ద ఉన్నాయి. ఇటీవ‌లే ఐఎన్ఎస్ ప్ర‌భ‌ల్ కూడా అరేబియా స‌ముద్రంలో మిస్సైల్ ప‌రీక్ష చేప‌ట్టింది.

Tags :
|

Advertisement