Advertisement

  • పాకిస్తాన్ టీంలో పదికి పెరిగిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

పాకిస్తాన్ టీంలో పదికి పెరిగిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

By: Sankar Tue, 01 Dec 2020 4:38 PM

పాకిస్తాన్ టీంలో పదికి పెరిగిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య


కివీస్ పర్యటనలో కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు పాకిస్తాన్ టీం భారీ మూల్యం చెల్లించుకుంటుంది...ఇప్పటికే జట్టులో ఏడుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు ..కివీస్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ టీం ను హెచ్చరించింది..అయితే తాజాగా పాకిస్తాన్ టీం లో కరోనా కేసులు పెరిగాయి....

తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో జట్టులో కరోనా కేసుల సంఖ్య 10 కి చేరింది. తాజాగా పాకిస్థాన్ యూనిట్‌లోని మొత్తం 46 మంది సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. న్యూజిలాండ్‌లో డిసెంబర్ 18 నుండి 3 మ్యాచ్‌ల టీ20 ఐ సిరీస్ మరియు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో తలపడనుంది.

ఈ పర్యటన జనవరి 7 తో ముగుస్తుంది. అయితే ఇందుకోసం మొత్తం 54 మంది ఆటగాళ్లు కివీస్ కు వెళ్లారు. అయితే అక్కడ వారు కరోనా నియమాలను పాటించకపోవడం తో మొదట ఆరుగురు, తర్వాత ఒక్కరు ఇప్పుడు ముగ్గురు ఆటగాళ్లు ఈ విటర్ బారిన పడ్డారు

Tags :
|

Advertisement