Advertisement

సుశాంత్ కేసులో మరో షాకింగ్ న్యూస్...

By: chandrasekar Thu, 27 Aug 2020 3:43 PM

సుశాంత్ కేసులో మరో షాకింగ్ న్యూస్...


పోలీసులు సుశాంత్ ప్రేయసి రియాను కీలకంగా తీసుకొని యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రియాకు సంబంధించి ఒక్కొక్కటిగా షాకింగ్ న్యూస్ బయటకు వస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఇప్పటికే రియాకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ, వాళ్ళతో ఆమె చేసిన వాట్సాప్ చాట్ వివరాలు సీబీఐకి అప్పగించింది ఈడీ. దీంతో ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తుండగా సుశాంత్ కుటుంబం తరపు న్యాయవాది మరో సంచలన విషయ౦ బయటకు తీసుకొచ్చారు.

సుశాంత్, ఆయన ప్రేయసి రియా చక్రవర్తి ముంబైలోని ఓ విలాసవంతమైన డుప్లెక్స్ హౌస్‌లో ఉండేవారట. తరచుగా ఆ ఇంట్లోనే ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకునేవారట సుశాంత్, రియా. అయితే ఎన్నో సందర్భాల్లో సుశాంత్ మత్తులో ఉండి పడిపోతే ఆయనను క్రింది రూమ్‌లో ఉంచేసి ఏ మాత్రం పట్టింపు లేకుండా పై రూమ్‌లో రియా తన స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేసేదని లాయర్ చెప్పినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

రియా కారణంగానే సుశాంత్ డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడని అంటున్నారు. కాగా సుశాంత్ మరణానికి ముందే అంటే జూన్ 14న సుశాంత్ మరణించగా, జూన్ 8వ తేదీనే రియా సుశాంత్‌తో కట్ చేసుకుందని తెలుస్తుండటం, అదే సమయంలో బాలీవుడ్ బడా డైరెక్టర్ మహేష్ భట్‌తో రియా చక్రవర్తి సంభాషించడం పలు అనుమానాలు లేవెనెత్తింది.

ఈ క్రమంలో సుశాంత్ ఆత్మహత్య కేసును లోతుగా విచారణ చేసేందుకై సీబీఐ ఆఫీసర్స్ ఏ క్షణంలో అయినా రియాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు రియాకు డ్రగ్స్ అలవాటే లేదని, కావాలంటే ఆమె రక్త పరీక్షకు కూడా సిద్ధంగా ఉందని రియా తరఫు న్యాయవాది వాదిస్తున్నాడు. అనూహ్య మలుపులు తిరుగుతూ మిస్టరీని తలపిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో చివరకు దోషులు ఎవరో తెలియాలి.

Tags :
|

Advertisement