తెలంగాణ కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ...విజయశాంతి బీజేపీ గూటికి
By: chandrasekar Wed, 28 Oct 2020 10:10 AM
తెలంగాణ రాష్ట్ర
కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి హస్తం పార్టీ నుంచి బీజేపీ గూటికి
చేరబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు
ఆమె దూరంగా ఉంటున్నారు. దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచార౦ హోరాహోరీగా సాగుతున్నా విజయశాంతి అటువైపు
కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా కాంగ్రెస్కు ఓటు వేయమని
పిలుపు ఇవ్వలేదు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్రావు ఇంటిపై సోదాలు, ఆ
తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పోలీసుల వివాదంపై విజయశాంతి
ఘాటుగా స్పందించారు. కేసీఆర్ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో విజయశాంతి
కాంగ్రెస్కు దూరం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని
విజయశాంతి నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు ప్రకటించాయి. అంతేకాకుండా ఈ
సమావేశానికి కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా
విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం. నవంబర్ 10వ తేదీ లోపు ముహూర్తం చూసుకుని రాములమ్మ బీజేపీలో
చేరనున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి కమలం గూటికి చేరనున్నట్లు
తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విజయశాంతి ఎటువంటి
క్లారిటీ ఇవ్వలేదు.