రైతు నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన మరో రెవెన్యూ ఇన్స్పెక్టర్
By: chandrasekar Sat, 29 Aug 2020 12:16 PM
తాజాగా నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో పని చేస్తున్న రెవిన్యూ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. తహసీల్దారు కార్యాలయాల్లో ఎమ్మార్వోలు సహా రెవెన్యూ సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా బయట పడుతున్నాయి. ఓ పేద రైతు నుంచి రూ.10
వేలు లంచం తీసుకుంటున్న సమయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నల్గొండ జిల్లాలోని భీమనపల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే రైతు తనకు చెందిన 17
గుంటల వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఎమ్మార్వోకు అర్జీ పెట్టుకున్నారు. ఆ పనిని ఎమ్మార్వో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యాం నాయక్కు అప్పజెప్పారు.
అందుకు రెవెన్యూ ఇన్సెపెక్టర్ రూ.10 వేలు లంచంగా ఇస్తేనే పని పూర్తి చేస్తానని డిమాండ్ చేసాడు. దీనితో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం ఎమ్మార్వో కార్యాలయంలో రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణ దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పంచనామా నిర్వహించిన అధికారులు శనివారం హైదరాబాద్లోని స్పెషల్ కోర్ట్లో అవినీతి అధికారి శ్యాం నాయక్ను హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.