హైదరాబాద్లో ఉబర్ నుంచి మరో కొత్త సర్వీస్
By: chandrasekar Wed, 27 May 2020 2:57 PM
క్యాబ్ అగ్రిగేటింగ్
కంపెనీ ఉబర్ హైదరాబాద్, ఢిల్లీ, నోయిడా, చెన్నై, చండీగఢ్లలో గురువారం నుంచి కనెక్ట్
పేరుతో ప్యాకేజీ సర్వీసులసు మొదలుపెట్టింది. కోల్కతా, జైపూర్, గువాహటి, గుర్గావ్లో ఇది వరకే ఇలాంటి సేవలను కంపెనీ
స్టార్ట్ చేసింది. నగరంలో ఒక చోట నుంచి మరోచోటికి వస్తువులను రవాణా చేయడానికి
కనెక్ట్ సర్వీసు ఉపయోగపడుతుంది. సోషల్ డిస్టెన్సింగ్
రూల్స్ను పాటిస్తూ వస్తువులను డెలివరీ ఇస్తున్నామని కంపెనీ తెలిపింది.
ఉబర్ టెక్నాలజీ, నెట్వర్క్ ద్వారా సమర్థంగా సేవలు
అందించగలుగుతున్నామని వివరించారు. గతవారం ప్రారంభించిన కనెక్ట్కు మంచి
స్పందన వస్తోందని ఉబర్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్
ప్రభుజీత్ సింగ్ చెప్పారు.
ఐదు కిలోల కంటే తక్కువ
బరువున్న ప్యాకేజీలను టూవీలర్ ద్వారా డెలివరీ ఇస్తారు. కనెక్ట్ సేవలు అందించే సిబ్బందికి
గవర్నమెంట్ రూల్స్పై ట్రైనింగ్ ఇప్పించామని
వెల్లడించింది. కస్టమర్ తన వస్తువును పంపించాక, ఉబర్ యాప్ ద్వారా దానిని ట్రాక్
చేసుకోవచ్చు. డెలివరీ స్టేటస్ను షేర్ చేయొచ్చు.
హైదరాబాద్లోనూ
ప్యాసింజర్ సర్వీసులను తిరిగి అందిస్తున్నామని ఉబర్ తెలిపింది.
మాస్కు పెట్టుకున్న వారినే క్యాబ్లోకి అనుమతిస్తున్నామని, డ్రైవర్లకు కూడా మాస్క్ వెరిఫికేషన్
సెల్ఫీని తప్పనిసరి చేశామని పేర్కొంది. డ్రైవర్తోపాటు ప్యాసింజర్లు
ప్రయాణానికి ముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలి. డ్రైవర్ పక్కన కాకుండా
కారు వెనక సీట్లో మాత్రమే కూర్చోవాలి.