కేంద్రంలో మరో మంత్రి కరోనా వైరస్
By: chandrasekar Thu, 08 Oct 2020 4:53 PM
పార్లమెంటరీ వ్యవహారాల
శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రల్హాద్ జోషికి కరోనా పాజిటివ్గా
నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన బుధవారం రాత్రి ట్విటర్ ద్వారా తెలిపారు. కరోనా
పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు.
తనకు ఎలాంటి లక్షణాలు
లేకుండానే పాజిటివ్గా తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో
ఉంటున్నట్లు తెలిపారు.
కర్ణాటకకు చెందిన
ప్రల్హాద్ జోషి కరోనా సంక్షోభ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కీలక
పాత్ర పోషించారు.
గత నెలలో ప్రత్యేక
ఏర్పాట్ల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణలో విశేష పాత్ర పోషించారు.
కర్ణాటక రాష్ట్రానికే చెందిన మరో కేంద్ర మంత్రి సురేశ్ అంగడి కరోనా బారినపడి మృతి
చెందిన సంగతి తెలిసిందే.
Tags :
another |
minister |