ఆన్లైన్ యాప్ల రుణం కారణంగా మరొక వ్యక్తి ఆత్మహత్య
By: chandrasekar Fri, 18 Dec 2020 3:46 PM
గుంటూరు మంగళ గిరికి
చెందిన సునీల్(29) హైదరాబాద్ నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో
పనిచేస్తున్నాడు. భార్య, ఆరునెలల కూతురుతో కలిసి రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో
నివసిస్తున్నాడు. ఆన్లైన్ యాప్ల నుంచి రూ.50 వేల రుణం తీసుకుని, అధికవడ్డీలు చెల్లించలేక
మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా కారణంగా సునీల్ ఉద్యోగం పోయింది. దీంతో
తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురైన అతడు పలు ఆన్లైన్ యాప్ల ద్వారా మొత్తం రూ.50 వేలు
అప్పు చేశాడు. యాప్ల నిర్వాహకులు 30 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని ఇటీవల అతడిపై
తీవ్ర ఒత్తిడి చేశారు. వీటితో పాటు సునీల్కు వ్యక్తిగతంగా మరో రూ.6 లక్షల
అప్పు ఉంది. మూడు నెలల క్రితం స్వగ్రామంలో ఉన్న భూమిని విక్రయించి తల్లిదండ్రులు ఆ
అప్పు చెల్లించారు. అనంతరం తండ్రి వెంకటరమణ సునీల్కి మరో రూ.లక్ష కూడా ఇచ్చాడు.
ఆన్లైన్ యాఆన్లైన్లో
అప్పులు ఇచ్చిన యాప్ల నిర్వాహకులు సునీల్ ఫోన్ డేటాను హ్యాక్ చేసి, అతడి
స్నేహితులు, బంధువులకు ‘సునీల్ డిఫాల్టర్’అని అతడి ఫొటోతో
మెసేజ్లు పంపారు. దీంతో సునీల్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. యాప్ నిర్వాహకుల
వేధింపులు తీవ్రమవడంతో పది రోజులక్రితం సునీల్ సైబర్ క్రైంకు ఎస్ఎంఎస్ ద్వారా
ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్వయంగా ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించగా సునీల్
వెళ్లలేదు. అతడికి మూడు రోజులక్రితం బంజారాహిల్స్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రూ.7 లక్షల
ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. బుధవారం మధ్యాహ్నం కంపెనీ నిర్వాహకులు కాల్ చేయగా, ‘నేను
ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఉద్యోగం మరొకరికి ఇవ్వండి’అని చెప్పి కాల్ కట్ చేసి
ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. బుధవారం రాత్రి భోజనం చేసేందుకు రమ్మని సునీల్ భార్య
తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో, కిటికీ లోంచి చూడగా అతడు ఉరేసుకొని కనిపించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.