- హోమ్›
- వార్తలు›
- ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ ప్రభుత్వం మరో సంచలనం – పీజీ వైద్య విద్య ఫీజులు భారీగా తగ్గింపు
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ ప్రభుత్వం మరో సంచలనం – పీజీ వైద్య విద్య ఫీజులు భారీగా తగ్గింపు
By: chandrasekar Sat, 30 May 2020 5:36 PM
పీజీ వైద్య విద్య ఫీజులను
భారీగా తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పేద
విద్యార్థలును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్
సర్కార్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పీజీ వైద్య విద్య
ఫీజులను భారీగా తగ్గిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
డబ్బున్న వారికి మాత్రమే
పీజీ వైద్య విద్య సొంతం కాకూడదనే ఉద్దేశంతో పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని
ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కన్వీనర్ కోటా, యాజమాన్య
కోటా, ఎన్ఆర్ఐ కోటాలన్నింట్లోనూ ఫీజులను తగ్గించింది. ఈ
తగ్గించిన పీజీ వైద్య విద్య ఫీజులు 202-21 నుంచి 2022- 2023 వరకు
అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. మైనారిటీ, నాన్-మైనారిటీ, ప్రయివేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు అన్నింటిలో కూడా ఒకే
తరహ ఫీజులు ఉండనున్నాయి.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల
మేరకు పీజీ వైద్య విద్య సీట్ల భర్తీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు భారీ లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ఫీ రెగ్యులేటరీ కమిటీ
ప్రతిపాదించిన మేరకే ఫీజుల నిర్ణయం ఉండాలి. వార్షిక ఫీజును కాలేజీ యాజమాన్యాలు
రెండు దఫాలుగా వసూలు చేయవచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు
చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యార్ధులకు
ఇస్తున్న స్టయిఫండ్ను ప్రయివేటు కాలేజీలలో కూడా ఇవ్వాలి. ఫీజుల వసూళ్లపై ఎన్టీఆర్
హెల్త్ యూనివర్సిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. దీంతో దాదాపు అన్ని
కేటగిరీలలోనూ ఫీజులు సగానికి సగం తగ్గిపోనున్నాయి.