కరోనాతో మరో ప్రముఖ నటుడి మృతి...
By: chandrasekar Mon, 16 Nov 2020 11:06 AM
ప్రముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్
ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ (85)
ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గతనెలలో సౌమిత్ర
ఛటర్జీకి కరోనావైరస్ పాజిటివ్గా నిర్థారణ అయిన తరువాత కోల్కతాలోని ఆసుపత్రిలో
చేరారు. ఆ తరువాత ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స
పొందారు. ఈ క్రమంలో ఆదివారం పరిస్థితి మరింత దిగజారడంతో.. కోల్కతాలోని బెల్లే
వ్యూ ఆసుపత్రిలో సౌమిత్ర ఛటర్జీ చికిత్స పొందుతూ.. కన్నుమూశారు.
కరోనా పాజిటివ్గా
నిర్ధారణ అయిన తరువాత ఆయనకు రెండు సార్లు ప్లాస్మా చికిత్స అందించినా ఫలితం
లేకపోయిందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. నాడీవ్యవస్థ, కిడ్నీలపై
కరోనా తీవ్ర ప్రభావం చూపిందని 13వ తేదీ
నుంచి ఆయన చికిత్సకు స్పందించ లేదని వైద్యులు అన్నారు.
సౌమిత్ర ఛటర్జీ 1935 జనవరి
19న కోల్కతాలో
జన్మించారు. దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే దర్శకత్వం వహించిన ‘అపుర్ సంసార్' సినిమా
(1959) తో కెరీర్ను ప్రారంభించారు. సౌమిత్ర మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింగ్, ప్రధానమంత్రి
నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా, పశ్చిమ బెంగాల్
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన
అంత్యక్రియల్లో పశ్చిమబెంగాల్ సీఎం మమత పాల్గొని దిగ్గజ నటుడికి
నివాళులర్పించారు.