టెస్టు క్రికెట్లో 500 వికెట్ మైలురాయిని అందుకున్న మరో ఇంగ్లాండ్ వీరుడు
By: chandrasekar Wed, 29 July 2020 3:18 PM
తాజాగా టెస్టు క్రికెట్లో
500
వికెట్లు తీసిన ఏడో ఆటగాడిగా ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ రికార్డు నెలకొల్పాడు. సుదీర్ఘకాలం
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తేనే 500 వికెట్ల మైలురాయిని
అందుకోగలరు.
టెస్టుల్లో అత్యధిక
వికెట్లు తీసిన బౌలర్గా శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ 800
వికెట్లతో అగ్రస్థానంలో
కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా
స్పిన్నర్ షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో.. టీమిండియా స్పిన్నర్
అనిల్ కుంబ్లే 619 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
తొలి మూడు స్థానాల్లో
ఉన్న ముగ్గురు స్పిన్నర్లే కావడం
విశేషం. వీరి తర్వాత జేమ్స్ ఆండర్సన్(589), గ్లెన్ మెక్గ్రాత్(563), కోర్ట్నీ వాల్ష్(519), స్టువర్ట్ బ్రాడ్(500) తర్వాతి
స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆండర్సన్, బ్రాడ్
మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. ఆండర్సన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన
రెండో ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ కావడం విశేషం.