అంబానీ కుటుంబం నుండి మరొక వారసుడు - తండ్రైన ఆకాశ్ అంబానీ
By: chandrasekar Thu, 10 Dec 2020 7:18 PM
దేశంలోనే ప్రముఖ వ్యాపార
దిగ్గజం అంబానీ కుటుంబంలో కొత్తగా వారసుడు వచ్చాడు. సంబరాల్లో మునిగితేలుతున్న
అంబానీ కుటుంబం. నీతూ మరియు ముఖేష్ అంబానీ దంపతులు ఇప్పుడు బామ్మ- తాతయ్యలుగా
ప్రమోషన్ అందుకున్నారు. ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ సతీమణి
శ్లోకా మెహతా ముంబైలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇక్కడ తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ సంతోషంలో అంబానీ కుటుంబం గురువారం ప్రకటన విడుదల చేశారు.
తమ ఇంట ‘‘శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో శ్లోకా- ఆకాశ్ అంబానీ
తల్లిదండ్రులయ్యారు. వారికి కుమారుడు జన్మించాడని తెలిపారు. అందువల్ల నీతా- ముఖేష్
అంబానీ మొదటిసారిగా నానమ్మ- తాతయ్య అయ్యారు. ధీరూభాయి- కోకిలాబెన్ మునిమనవడికి
స్వాగతం పలకడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. తల్లీ మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
తమ ఇంట కొత్త సభ్యుడి రాకతో మెహతా- అంబానీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది అంటూ
శుభవార్తను అందించారు. వీరి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
ముఖేష్ అంబానీ పెద్ద
కుమారుడికి గతేడాది మార్చిలో ఆకాశ్ మరియు శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన
సంగతి అందరికి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో మూడు ముడుల బంధంతో
వీరు ఒక్కటయ్యారు. శ్లోకా మెహతా ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె.
ఇప్పుడు ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వారసత్వాన్ని నిలబెడుతూ ఆయన
సంతానం కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరు వ్యాపారవేత్తలుగా
రాణిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. దేశంలో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన
రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లైన ఆయన కుమార్తె ఇషా అంబానీ మరియు పెద్ద కుమారుడు
ఆకాష్ అంబానీ 2020 ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
రిలయన్స్ కంపెనీలు ప్రస్తుతం మంచి లాభాల బాటలో నడుస్తున్నాయి.