వాయుగుండంగా మారనున్న అల్పపీడనం ..ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
By: Sankar Sun, 29 Nov 2020 11:14 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇవాళ, రేపు తెలంగాణలో పొడి వాతావారణం ఉంటుందని అంటున్నారు అధికారులు.
బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తమిళనాడులో రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో డిసెంబర్ 1 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలపింది.
ఈ వాయుగుండం పశ్చిమ దిశగా కదిలి డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడులోని కోస్తా ప్రాంతాన్ని తాకుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల మంగళ, బుధవారాల్లో తమిళనాడు, పుదుచ్చెరిలో కరైకల్, మహే, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ తీరం, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది