మరో అందలం అధిరోహించిన ముగ్గురు అతివలు
By: chandrasekar Fri, 23 Oct 2020 1:22 PM
భారత సైన్యంలో
లెఫ్టినెంట్ హోదాలో సేవలందిస్తున్న ముగ్గురు అతివలు మరో అందలం అధిరోహించారు.
డానియర్ యుద్ధ విమానాలను నడిపే పైలట్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసారు.
ఉత్తరప్రదేశ్ తిల్హార్కు
చెందిన శుభాంగి స్వరూప్, ఢిల్లీకి చెందిన లెఫ్టినెంట్ దివ్య శర్మ, బిహార్ ముజఫర్నగర్కు చెందిన శివంగి డానియర్
ట్రైనింగ్ పూర్తి చేసుకొని పరేడ్లో పాల్గొన్నారు.
కొచ్చి తీరంలోని ఐఎన్స్
గరుడ యుద్ధనౌకలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మొదటిబ్యాచ్
వీరిదే కావడం విశేషం.
సదరన్ నావల్ కమాండ్
ఆధ్వర్యంలో ఎనిమిది నెలలు జరిగిన డానియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్లో
ఆరుగురు పాల్గొనగా ఈ ముగ్గురు అర్హత సాధించారు.
వీరిలో లెఫ్టినెంట్
శివాంగి గతేడాదే అర్హత సాధించగా, మిగిలిన ఇద్దరూ ఇప్పుడు ట్రైనింగ్
పూర్తిచేసుకున్నారు. డానియర్ విమానాన్ని నడిపిన మొదటి మహిళా బ్యాచ్గా గుర్తింపు
పొందారు.