మహారాష్ట్ర పోలీస్ విభాగంలో మరో 236 మంది కరోనా
By: chandrasekar Thu, 30 July 2020 8:45 PM
మహారాష్ట్ర పోలీస్
విభాగంలో కూడా ప్రతిరోజు వందల్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది.
ప్రతిరోజూ వేలల్లో
కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం
వరకు గత 24 గంటల వ్యవధిలో 236 కొత్త కేసులు నమోదయ్యాయి.
దీంతో మహారాష్ట్ర పోలీసులలో కరోనా బారినపడిన వారి సంఖ్య 8,958కి
చేరింది.
అందులో 6,962 మంది
పోలీసులు ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 1898
యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, బుధవారం కరోనా సోకిన మరో పోలీస్ మరణించడంతో మహారాష్ట్ర
పోలీస్ విభాగంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 98కి
చేరింది. మహారాష్ట్ర పోలీస్ డిపార్టుమెంట్ ఈ వివరాలను పేర్కొంది.