తెలుగు రాష్ట్రాల నుంచి మరో 10 ప్రత్యేక రైళ్లు...
By: chandrasekar Thu, 15 Oct 2020 6:07 PM
దక్షిణ మధ్య రైల్వే దసరా
పండుగ సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో 10
ప్రత్యేక రైళ్లను నడపడానికి నిర్ణయించింది. కాకినాడ- లింగంపల్లి, తిరుపతి-
లింగంపల్లి, నర్సాపూర్- లింగంపల్లితో పాటు విజయవాడ- హుబ్లీ, తిరుపతి-
అమరావతి మార్గాల్లో ఈ రైలు సర్వీసులను నడపనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బుధవారం
రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ నెల 20 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కాకినాడ - లింగంపల్లి, తిరుపతి
- లింగంపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే
పేర్కొంది.
అలాగే, నర్సాపూర్-
లింగంపల్లి స్టేషన్ల మధ్య ఈ నెల 23 నుంచి నవంబర్ 30వ తేదీల మధ్య రైలు సర్వీసులు నడుస్తాయని అధికారులు
పేర్కొన్నారు. విజయవాడ- హుబ్లీ, హుబ్లీ - విజయవాడ మధ్య ఈ నెల 21 నుంచి
నవంబర్ 30వ తేదీ
వరకు ప్రతి రోజూ రైలు సర్వీసులు నడపనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే, తిరుపతి
నుంచి మహారాష్ట్రలోని అమరావతికి ఈ నెల 20 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో నడపనున్నారు. అలాగే, అమరావతి
నుంచి తిరుపతికి ఈ నెల 22 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి గురు, సోమవారాల్లో ఈ సర్వీసులను నడుపుతామని దక్షిణ మధ్య
రైల్వే పేర్కొంది.