అన్నాడీంకే ఎమ్మెల్యే ప్రభు ప్రేమ వివాహం...ఆత్మహత్యాయత్నం చేసిన తండ్రి
By: chandrasekar Wed, 07 Oct 2020 7:11 PM
తమిళనాడులో విల్లుపురం
జిల్లాలోని తియగదురుగమ్ పట్టణానికి చెందిన అధికార అన్నాడీంకే ఎమ్మెల్యే ప్రభు
అదే పట్టణానికి చెందిన సౌందర్య గత
నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సౌందర్య తండ్రి స్వామినాథన్ (48), ఇతర
కుటుంబసభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బీఏ సెకండియర్
విద్యార్థిని అయిన సౌందర్య ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిపోయింది.
దీంతో సౌందర్య తండ్రి స్వామినాథన్ తన కూతరును కళ్లకురిచి ఎమ్మెల్యే ప్రభు
కిడ్నాప్ చేశాడని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఈ విషయం పోలీసులకు
చెబితే చంపేస్తామని ఎమ్మెల్యే అనుచరులు తనను బెదిరించారని ఆ వీడియోలో
తెలిపారు. అయితే, స్వామినాథన్ వీడియోకు స్పందిస్తూ ఎమ్మెల్యే ప్రభు, సౌందర్య
సోమవారం ఉదయం మరో వీడియో పోస్ట్చేశారు. తాము గత నాలుగేండ్లుగా
ప్రేమించుకుంటున్నామని, ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నామని ఆ వీడియోలో స్పష్టంచేశారు.
తమ ప్రేమ గురించి సౌందర్య తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు
పట్టించుకోలేదని ఎమ్మెల్యే ప్రభు ఆరోపించారు. కూతురు పెండ్లి విషయం తెలియగానే
స్వామినాథన్ ఎమ్మెల్యే ఇంటి ముందుకు వెళ్లి ఆత్మహత్యయత్నం చేశారు. దీంతో అక్కడే
ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.