Advertisement

  • సుశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ప్రియురాలు అంకిత

సుశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ప్రియురాలు అంకిత

By: chandrasekar Wed, 17 June 2020 2:07 PM

సుశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ప్రియురాలు అంకిత


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు కూడా ముంబైలో జరిగాయి.అయితే సుశాంత్ మాజీ ప్రియురాలు ఇవాళ ముంబైలో అతని ఇంటికి వచ్చింది. సుశాంత్‌తో కలిసి 2009లో హిందీ సీరియల్‌తో బుల్లి తెర ద్వారా పరిచయం అయిన విషయం తెలిసిందే.

పవిత్ర రిష్తా అనే ఈ టీవీ సీరియల్ అంకిత లోఖండే సుశాంత్‌తో కలిసి నటించింది. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సీరియల్‌లో సుశాంత్ ‘మానవ్’గా ప్రధాన పాత్ర పోషించి టీవీ ఆడియెన్స్‌ని మెప్పించాడు. ఈ సీరియల్‌లో తనకి జోడీగా నటించిన అంకిత లోఖండేతో సుశాంత్‌ ప్రేమలో పడ్డాడు. ఆరేళ్లపాటు వీళ్ల ప్రేమ కొనసాగింది.

కానీ 2016లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - అంకిత లోఖండే విడిపోయారు.అప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న సుశాంత్ వేరే నటితో డేటింగ్‌లో పడ్డాడు. దీంతో అంకిత తనకి దగ్గరి వ్యక్తితో నిశ్చితార్ధం జరుపుకుందని ప్రచారం కూడా జోరుగా జరిగింది. సుశాంత్ మరణం తర్వాత కుంగిపోయిన అంకిత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు. కనీసం సుశాంత్‌ను చివరి చూపు చూడాలని భావించినప్పటికీ కూడా కరోనా గైడ్‌లైన్స్ నేపథ్యంలో ఆ అవకాశం కూడా దక్కలేదు.

అంత్యక్రియల తర్వాత అంకిత సుశాంత్ ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపింది. సుశాంత్ జూన్ 14న బాంద్రాలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు బెడ్ షీట్‌తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసును ముంబై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ మానసిక స్థితితో పాటు ఆయన‌ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా డిప్రెషన్‌తో చనిపోయారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇటీవల సుశాంత్‌ బాంద్రాలో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌కు మారినట్లు తెలుస్తోంది. నెలకు రూ.4.5 లక్షలు ఫ్లాట్‌ అద్దె చెల్లిస్తున్నటుగా పోలీసులు కనుగొన్నారు.

Tags :
|
|

Advertisement