ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదు
By: chandrasekar Thu, 20 Aug 2020 09:16 AM
సాంగీక దూరం కచ్చితంగా పాటించక పోవడంతో కరోనా వ్యాప్తి రోజు రోజుకి ఎక్కువగా వ్యాప్తి చెందుతా వుంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మరింతగా విజృంభించి అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు చేయబడుతున్నాయి. ప్రజలు మరింత గా సంచరించడంతో వ్యాప్తి అధికమించింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో తెలిపింది.
కరోనా వ్యాప్తి అధికమవ్వడం వల్ల రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల
16,003కి చేరింది. గత 24గంటల్లో 86
మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ వివరాలు అందించింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య మొత్తంగా 2,906కు పెరిగింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో
86,725 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకొన్న వారి సంఖ్య 2 లక్షల 26వేల 372కు పెరిగింది. ఏపీలో కోవిడ్-19 టెస్టులు 30లక్షలు దాటాయి తెలిపారు. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 8,061 మంది డిశ్చార్జ్ అయినట్లు వివరాలు అందించారు.