ఆంధ్రప్రదేశ్లో 24 గంటలో రికార్డుస్థాయిలో 8,147 కరోనా కేసులు నమోదు
By: chandrasekar Sat, 25 July 2020 3:39 PM
ఆంధ్రప్రదేశ్లో కరోనా
తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా నిర్ధారణ కేసులు
నమోదు అయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నిర్వహించిన కరోనా
పరీక్షల్లో 8147 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మరో 49 మంది
కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 933కు
చేరుకుంది.
తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది,కృష్ణాలో
9, కర్నూలులో
8, శ్రీకాకుళంలో
7, పశ్చిమ
గోదావరిలో 5గురు కరోనాతో మృతి చెందారు. గుంటూరు, విశాఖలో
ముగ్గురు చొప్పున,చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాకు
బలయ్యారు.
ఒక్కరోజే తూర్పుగోదావరి
జిల్లాలో 1029 మంది, అనంతపురంలో 984,
కర్నూలులో 914,
పశ్చిమగోదావరిలో 807,
గుంటూరులో 703,
విశాఖలో 898,
చిత్తూరుల 630 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 80,858 మందికి కరోనా సోకింది.