Advertisement

  • ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు ..

ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు ..

By: Sankar Thu, 09 July 2020 3:23 PM

ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు ..



ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి ..గత నాలుగు అయిదు రోజులుగా అత్యధిక కేసులు నమోదు అవుతున్నప్పటికీ గత 24 గంటల్లో మాత్రం రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి..గత 24 గంటల్లో 16,882 మందికి పరీక్షలు నిర్వహించగా 1500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 53 మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 1555కు చేరాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 23814కు చేరింది. గడచిన 24 గంటల్లో 13మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 277కి చేరింది. గత 24 గంటల్లో 904మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 12154 నమోదయ్యింది. మరో 11383మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 236, గుంటూరు జిల్లాలో 228, విశాఖపట్నం జిల్లాలో 208, శ్రీకాకుళం జిల్లాలో 206, కృష్ణా జిల్లాలో 127, కడప జిల్లాలో 114, ప్రకాశం జిల్లాలో 96, అనంతపురం జిల్లాలో 91, కర్నూలు జిల్లాలో 73, తూర్పుగోదావరి జిల్లా 47, నెల్లూరు జిల్లాలో 31, విజయనగరం జిల్లాలో 26, పశ్చిమగోదావరి జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 2795 పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 2659కు చేరాయి. గుంటూరు జిల్లాలో 2663 కేసులు ఉన్నాయి.

Tags :
|
|
|

Advertisement