పాస్ పోర్ట్ వెరిఫికేషన్ క్లియరెన్స్ లో తొలి రెండు స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు
By: Sankar Wed, 24 June 2020 10:35 AM
పాస్ పోర్ట్ వెరిఫికేషన్ క్లియరెన్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి ..ఇందులో ఆంధ్ర ప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా , తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది అయితే ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవడం ఇది వరుసగా రెండోసారి ..ప్రజలకు మెరుగైన రీతిలో పాస్ పోర్ట్ సేవలను అందిస్తున్నందుకు కేంద్ర విదేశాంగశాఖ అవార్డును ప్రకటించింది..
పోలీస్శాఖ పాస్పోర్ట్ వెరిఫికేషన్ & క్లియరెన్స్లో ఉత్తమ సేవలు అందిస్తోన్న పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ మరింతగా సన్నద్ధంగా ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇక ఈ లిస్ట్ లో ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ తర్వాత స్థానాల్లో హర్యానా, కేరళలు నిలిచాయి.
పాస్ పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ధృవపత్రాల తనిఖీలు నిజాయితీగా చేస్తున్నారా లేదా, ఎంత సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు, పాస్ పోర్టుల జారీపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయా లేదా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా విదేశీ వ్యవహారాలశాఖ ఈ అవార్డులను ప్రకటిస్తోంది