లంచాలు తీసుకుంటున్న విద్యుత్ ఉద్యోగుల్లో ఆంధ్ర దేశంలోనే తొలిస్థానం: నీతి ఆయోగ్
By: chandrasekar Fri, 13 Nov 2020 4:28 PM
బెంచ్మార్కింగ్
డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీస్’ పేరుతో కేంద్ర విద్యుత్ శాఖ, నీతి
ఆయోగ్, రాక్
ఫెల్లర్ ఫౌండేషన్, స్మార్ట్ పవర్ ఇండియా సంయుక్తంగా 10
రాష్ట్రాల్లో సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో లంచాలు తీసుకుంటున్న విద్యుత్
ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలిస్థానంలో నిలవడం గమనార్హం. సర్వేలో
పాల్గొన్న 57 శాతం మంది వినియోగదారులు తమకు ఇలాంటి పరిస్థితి
ఎదురైందని చెప్పినట్లు నివేదిక తెలిపింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను
చర్చించి, వాటికి
పరిష్కార మార్గాలను ఈ నివేదిక వివరించింది. దేశవ్యాప్తంగా ‘చేసిన పనికి నిర్దేశిత
మొత్తం కంటే అదనంగా ఇవ్వాలని విద్యుత్తు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టు గృహ
వినియోగదారుల్లో 33% మంది, సంస్థాగత వినియోగదారుల్లో 21%.. మొత్తంగా 32% మంది చెప్పారు. ఈ అదనపు మొత్తం గుజరాత్లో అతి
తక్కువగా 8 శాతం, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, దక్షిణ
డిస్కంల పరిధిలో అత్యధికంగా 57 శాతంగా ఉంది’ అని నివేదికలో తెలిసింది . విద్యుత్తు
సమస్యలు తెలుసుకోవడానికి 10 రాష్ట్రాల్లోని 25 డిస్కంల పరిధిలో 25,116 మందిని సర్వేచేశారు.
అందులో ఆంధ్రప్రదేశ్లో 1,809 మంది ఉన్నారు. ఈ అంశంపై వినియోగదారులను చైతన్య పరచడం, అదనపు
మొత్తాలను అడిగే సిబ్బందిపై డిస్కింలు చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతి ఆయోగ్
స్పష్టం చేసింది.
కర్ణాటక డిస్కంలు
వినియోగదారులకు అందుబాటు విషయంలో టాప్లో ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్
డిస్కం అట్టడుగున నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని గృహ విద్యుత్తు వినియోగదారులు
గ్రిడ్ కనెక్షన్, మౌలిక వసతులకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
తూర్పు డిస్కం పరిధిలోని వ్యవసాయ వినియోగదారులకు సరైన మౌలిక వసతులు లేవు. వాణిజ్య
వినియోగదారులకు దక్షిణ డిస్కం పరిధిలో గ్రిడ్ కనెక్షన్ సమస్య ఉంది. దక్షిణ
డిస్కం పరిధిలో కొత్త కనెక్షన్ల విషయంలో, తూర్పు డిస్కం పరిధిలో విద్యుత్తు నాణ్యత విషయంలో
వినియోగదారులు అసంతృప్తితో ఉన్నారు. దేశవ్యాప్తంగా 92 శాతం మంది తమకు 50
మీటర్ల పరిధిలో పూర్తిస్థాయి విద్యుత్ మౌలిక సౌకర్యాలున్నట్టు తెలిపాయి. వీరిలో
అందరికీ విద్యుత్ సౌకర్యం లేదు. విద్యుత్ స్తంభాల నుంచి దూరమే దీనికి ప్రాథమిక
కారణం. మొత్తం 87 శాతం మందికి గ్రిడ్ ఆధారిత విద్యుత్ సౌకర్యం ఉండగా
మిగతా 13 శాతం
మంది నాన్-గ్రిడ్ లేదా ఎటువంటి విద్యుత్ సౌకర్యాలు లేవు. రోజుకు 17 గంటల
విద్యుత్ సరఫరా ఉన్నట్టు పేర్కొన్నారు. దాదాపు 85 శాతం మంది మీటర్తో
కూడిన విద్యుత్ సౌకర్యం ఉన్నట్టు తెలిపారు. సర్వేలో పాల్గొన్న 66 శాతం
మంది విద్యుత్ సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయగా.. వీరిలో పట్టణ ప్రాంతాల్లో 74 శాతం, గ్రామీణ
ప్రాంతాల్లో 60 శాతం మంది ఉన్నారు.