ఆంధ్రప్రదేశ్ 2.24 కోట్ల అంచనా వ్యయంతో 2020-21 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది
By: chandrasekar Tue, 16 June 2020 4:12 PM
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో
ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2020-21 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ఈసారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2.24 కోట్ల అంచనా వ్యయంతో 2020-21 వార్షిక బడ్జెట్ను
ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. ఆర్థిక మంత్రిగా రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్ను
ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 1,80,392 కోట్ల రెవెన్యూ వ్యయం, 44,396 కోట్ల మూలధన వ్యయంతో అంచనాతో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ను
ప్రవేశపెట్టింది. సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ
పథకాలు అమలు చేస్తామని ఆయన మరోసారి చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ ఆర్థిక వ్యవస్థ
కుంటుపడకుండా చూశామని అన్నారు.
ఇక కేటాయింపుల
విషయానికికొస్తే వ్యవసాయానికి రూ. 11,891 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ. 3,615
కోట్లు, ధరల
స్థిరీకరణకు రూ. 3 వేల కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం రూ. 1,100
కోట్లు, మైనార్టీ
సంక్షేమానికి రూ. 1998.55 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ. 1,840
కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు. ఎస్సీల సంక్షేమానికి
రూ. 7, 525, కాపుల సంక్షేమానికి రూ. 2,845 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ. 23,406 కోట్లు కేటాయించారు. విద్యారంగానికి రూ. 22,604 కోట్లు, వైద్యరంగానికి రూ. 11,419 కోట్లు, ఆరోగ్యశ్రీకి
రూ. 2,100 కోట్ల
కేటాయింపులు చేశారు.
వీటితో పాటు వైఎస్ఆర్ గృహ
వసతికి రూ. 3 వేల కోట్లు, పీఎం అవాజ్ యోజన అర్బన్కు రూ. 2,540
కోట్లు, పీఎం
అవాజ్ యోజన గ్రామీణానికి రూ. 500 కోట్లు, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి రూ. 150
కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన వివరించారు. రేషన్ బియ్యానికి రూ. 3 వేల
కోట్లు, డ్వాక్రా
సంఘాలకు రూ. 975 కోట్లు, అభివృద్ధి పథకాలకు రూ. 84,140 కోట్లు, షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ. 15,735 కోట్లు కేటాయించారు. గతంతో పోలిస్తే అనేక శాఖలకు కేటాయింపులు పెంచారు.
వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు
రూ. 16 వేల
కోట్లు, వైఎస్ఆర్
ఆసరాకు రూ. 6300 కోట్లు, అమ్మ ఒడికి రూ. 6000 కోట్లు, జగనన్న విద్యాదీవెనకు రూ. 3009
కోట్లు, వైఎస్ఆర్
చేయూతకు రూ. 3000 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ. 2 వేల
కోట్లు, వైఎస్ఆర్
కాపు నేస్తం రూ. 350 కోట్లు, వైఎస్ఆర్ వాహనమిత్రకు రూ. 275
కోట్లు, వైఎస్ఆర్
జగనన్న చేదోడుకు రూ. 247 కోట్లు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ. 200
కోట్లు, వైఎస్ఆర్
మత్స్యకార భరోసాకు రూ. 109 కోట్లు, జగనన్న తోడు రూ. 100 కోట్లు, ఇమామ్, మౌజమ్లకు రూ. 50 కోట్లు, లా నేస్తంకు రూ. 12.75 కోట్లు, జెరూసలేం యాత్రకు రూ. 5 కోట్లు
కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గవర్నర్
ప్రసంగంతో ప్రారంభం కాగా సభ నిర్వహణపై బీఏసీ సమావేశం నిర్వహించారు.
* ఈసారి బడ్జెట్లో కూడా సంక్షేమ పథకాలు, నవరత్నాలకే
ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. అభివృద్ధి, సంక్షేమం
సమ్మిళితం చేసేలా బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా
సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.
* ఏడాదిలో 3.98 కోట్ల మంది ప్రజలకు రూ.42వేల
కోట్ల సాయం అందజేశామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు
అందిస్తున్నామని తెలిపారు.
* 45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూత. చేయూత కింద నాలుగేళ్లలో
ఒక్కొక్కరికి రూ.75వేలు, అమ్మ ఒడి ద్వారా 42.33 లక్షల మంది తల్లులకు రూ.6,350
కోట్లు అందజేయనున్నట్టు వివరించారు.
* మొత్తం బడ్జెట్ 2.25 లక్షల కోట్లు కాగా
ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.44.396.54 కోట్లుగా పేర్కొన్నారు.
* 2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే కాగా 2019-20కి అది 20 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. పేద ప్రజల
కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలుచేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
* సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు, మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు, రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు, ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు, ఇవి
రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం,
3.75 శాతం.
* వ్యవసాయ రంగానికి రూ.11,891 కోట్లు కేటాయింపులు.
* వైద్య రంగానికి రూ.11,400 కోట్లు, వైఎస్సార్
రైతు భరోసాకు రూ.3,600 కోట్లు.
* ఎస్టీలకు రూ.1804 కోట్లు, ఎస్సీలకు రూ.7,525 కోట్లు, బీసీలకు రూ.23,405 కోట్లు, రేషన్ బియ్యానికి రూ.3వేల కోట్లు.
* కాపుల సంక్షేమానికి రూ.2,845
కోట్లు, విద్యకు
రూ.22,400 కోట్లు.
* వైఎస్ఆర్ ఆసరా కోసం రూ.6,300
కోట్లు, వడ్డీలేని
రుణాలకు రూ.1,100 కోట్లు.
* వైఎస్ఆర్ గృహమిత్ర రూ.3,000 కోట్లు, వైఎస్ఆర్
వాహన మిత్ర రూ.275 .15కోట్లు.
* మత్స్యకార భరోసా రూ.198 కోట్లు, బలహీన
వర్గాల సంక్షేమానికి రూ.150 కోట్లు.
* జగనన్న చేదోడు రూ.245 కోట్లు, నేతన్న
నేస్తం రూ.200 కోట్లు, న్యాయ నేస్తం రూ.12.75 కోట్లు, జేరూసలెం యాత్రకు రూ.5 కోట్లు, రైతులకు
వడ్డీలేని రుణాలు 11 వేల కోట్లు.
* రైతులకు నష్టపరిహారం కోసం రూ.20
కోట్లు, జగనన్న
విద్యాదీవేన 3,009 కోట్లు, బలహీనవర్గాల గృహనిర్మాణానికి రూ.150
కోట్లు.
* విద్యారంగంలో నాడు-నేడు కోసం రూ.150
కోట్లు, ప్రభుత్వ
జూనియర్ కాలేజీలకు రూ.493 కోట్లు, ఎస్టీలకు రూ.1804 కోట్లు.
* వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం రూ.16వేల
కోట్లు, కాపు
నేస్తం రూ.350 కోట్లు.
* ఇమామ్లు, మౌజన్లకు రూ.50 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000
కోట్లు, మైనార్టీల
సంక్షేమానికి రూ.2,055 కోట్లు
* రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్కు రూ.248
కోట్లు, నేషనల్
హెల్త్ మిషన్ రూ.1,800 కోట్లు.
* వైద్య రంగానికి రూ.11,400 కోట్లు, ఆస్పత్రుల్లో
నాడు-నేడు కార్యక్రమానికి రూ.3,000 కోట్లు.
* కంటివెలుగు పథకానికి రూ.470
కోట్లు కేటాయింపు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాకు రూ.500 కోట్లు.
* జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనకు రూ.5,009
కోట్లు.
* ఉచిత విద్యుత్ కోసం రూ.425
కోట్లు, జగనన్న
తోడు రూ.930
కోట్లు.
* సీతంపేట, పార్వతీపురం, చింతూరు, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో ఆరు సూపర్ స్పెషాలిటీ
హాస్పిటల్స్ ఏర్పాటుకు ప్రతిపాదన.
* యువత, నైపుణాభివృద్ధికి రూ.856 కోట్లు, పంచాయతీరాజ్, రూరల్
డెవలప్మెంట్కు రూ. 16710.34 కోట్లు.
* పశుగాణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు కేటాయింపులు.
* హోంశాఖకు రూ.5,988.72 కోట్లు, జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు.
* న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు.
* సోషల్ వెల్ఫేర్ కోసం రూ.12,465.85 కోట్లు, ట్రాన్స్పోర్టు, ఆర్అండ్బీ కోసం రూ.6,588.58 కోట్లు.
* మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు.
* పీఎం ఆవాజ్ యోజన అర్బన్కు రూ.2540
కోట్లు, పీఎం
ఆవాజ్ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు.
* పారిశ్రామికాభివృద్ధికి 2,075. 56 కోట్లు, డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు.
* అగ్రిగోల్డ్ బాధితుల పరిహారం కోసం రూ.200
కోట్లు కేటాయింపు.
* ఉన్నత విద్యకు 12.38 శాతం, పంచాయితీ రాజ్కు 47 శాతం, టూరిజం
53 శాతం, ఐటీ
రంగానికి 56 శాతం కోత విధించారు.
* అనంతపురం-అమరావతి జాతీయ రహదారికి రూ.100
కోట్లు.
* బీసీల అభివృద్ధికి రూ.25,333 కోట్లు, వైద్య
విదాన్ పరిషత్కు రూ.743 కోట్లు.
* వైఎస్ఆర్ కృషి వికాస్ యోజనకు రూ.230
కోట్లు, ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాలకు రూ.743 కోట్లు, నేషనల్ హార్టికల్చర్ రూ.150
కోట్లు.
* సాధారణ పరిపాలనకు రూ.878.01 కోట్లు, రియల్
టైం గవర్నెన్స్ కోసం రూ.54.51 కోట్లు, వ్యవసాయ ల్యాబ్లకు రూ.65
కోట్లు.
* వైఎస్ఆర్ నవోదయం పథకానికి రూ.904
కోట్లు, కుటుంబ
సంక్షేమ కేంద్రాలకు రూ.204 కోట్లు,
104 సేవలకు రూ.150 కోట్లు.
* రాజధానిలో మౌలికవసతుల కోసం రూ.500
కోట్లు, గ్రామ
సచివాలాయాలకు రూ.1,634 కోట్లు, గ్రామ వాలంటీర్లకు రూ.1,104 కోట్లు.
* పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు.
* ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు.
* విద్యుత్ రంగానికి రూ. 6,984.72 కోట్లు.
* రైతు భరోసా కేంద్రాలకు రూ.100
కోట్లు, వ్యవసాయ
పరీక్ష కేంద్రాలకు రూ.65 కోట్లు.
* వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి రూ.1,500
కోట్లు, వయోవృద్ధుల
సంక్షేమానికి రూ.3,456 కోట్లు.