Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యం అధికంగా వున్న 13 నగరాలు

ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యం అధికంగా వున్న 13 నగరాలు

By: chandrasekar Tue, 15 Sept 2020 09:28 AM

ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యం అధికంగా వున్న 13 నగరాలు


రాష్ట్రంలో అటవీ సంపద తగ్గడంతో కాలుష్యం కోరలు చాచాయి. ఎక్కువగా చెట్లు కొట్టేయడంతో గాలి కాలుష్యం మరింత తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో 13 నగరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

పరిశ్రమలు అధికమవ్వడంతో బాటు కృత్రిమ వనరులు నశించిపోవడంతో కాలుష్యం అధికమైనట్లు తెలిపారు. 2014 నుంచి 2018 మధ్య కాలంలో దేశంలోని వివిధ నగరాల్లో గాలి నాణ్యతపై జరిపిన అధ్యయనంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 నగరాల్లో కాలుష్యం పెరిగిందని తెలిపారు. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో స్వచ్ఛమైన గాలి నాణ్యత అత్యల్పంగా ఉన్నట్లు గుర్తించామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

కాలుష్య నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌కాప్‌) కింద కాలుష్యం బారిన పడిన నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఎన్‌కాప్‌లో భాగంగా వాయు కాలుష్యం బారినపడిన నగరాల్లో కాలుష్యం వెదజల్లేందుకు ప్రధాన కారణాలను గుర్తించడానికి పలు అధ్యయనాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన ప్రజలు పడతారని.. నివారణోపాయాలను కనుగొని తగు జాగ్రత్తలు తీసికోవాలని సూచించారు.

వాహనాల వల్ల రోడ్లపై ఆవరించే ధూళి కణాలు, వాహన కాలుష్యం, చెత్త తగులబెట్టడం, నిర్మాణ, కూల్చివేత పనులు, పారిశ్రామిక కాలుష్యం వంటివి నగరాల్లో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు ఆయన వివరించారు. వాయు కాలుష్యం నుంచి నగరాలను కాపాడి గాలి నాణ్యతను మెరుగు పరిచేందుకు నగరాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు బాబుల్‌ సుప్రియో వివరించారు.

జల్‌ జీవన్‌ మిషన్‌ కింద మంచి నీటి కుళాయి కనెక్షన్లు

దేశవ్యాప్తంగా నీటి సమస్యలు పోగట్టడానికి జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద 2024 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఇళ్లకు మంచి నీటి కుళాయి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 2024 నాటికి 63.72 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు కల్పించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వార్షిక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.

ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ ప్రణాళిక కింద ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో 31.93 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీటి సదుపాయం కల్పించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు కూడా ఆటంకం ఏర్పడిందన్నారు. అన్‌లాక్‌లో నిర్మాణ పనుల ప్రారంభానికి అనుమతించిన తర్వాత జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని రతన్‌లాల్‌ కటారియా అందులో వివరించారు. త్వరలోనే మిషన్ పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Tags :
|
|

Advertisement