ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు
By: chandrasekar Tue, 13 Oct 2020 09:47 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు దాఖలు చేయబడింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం
కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీ సీఎం తన పరిధులన్నీ (లిమిట్స్) దాటారని, ఆయనకు
షోకాజ్ నోటీసులు ఇవ్వాలంటూ సోమవారం సుప్రీం కోర్టులో న్యాయవాది సునీల్ కుమార్
సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు, ఏపీ హైకోర్టు సిట్టింగ్ జడ్జిలకు వ్యతిరేకంగా వైసీపీ
ప్రభుత్వం మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని
తెలిపారు. సీఎం జగన్ గాని, ఆయన తరఫు వ్యక్తులు గాని న్యాయమూర్తులకు వ్యతిరేకంగా
భవిష్యత్తులో బహిరంగంగా మాట్లాటడం గాని, మీడియా
సమావేశాలు ఏర్పాటు చేయడం గాని చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టును
కోరారు. ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగంలోని 121,
211 ఆర్టికల్స్ను ఉల్లంఘించారని న్యాయవాది
పేర్కొన్నారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, న్యాయ
వ్యవస్థను గౌరవిస్తానని సీఎంగా జగన్ చేసిన ప్రమాణాన్ని తుంగలో తొక్కారని
ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డ సీఎం జగన్పై ఎందుకు చర్యలు
కూడదో తెలుసుకునేందుకు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని న్యాయవాది సునీల్
కుమార్ సింత్ కోరారు.
జడ్జిలకు వ్యతిరేకంగా
మాటలాడంవల్ల జగన్ సర్కారుపై చర్య తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ నెల 10వ తేదీన ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం
నిర్వహించిన ప్రెస్మీట్లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ
హైకోర్టు న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత
చంద్రబాబునాయుడు సూచనల మేరకు సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ
హైకోర్టు తీర్పుల్లో జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని
సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు
ఫిర్యాదు చేసినట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సుప్రీం కోర్టు
చీఫ్ జస్టిస్కు అక్టోబర్ 8న అందించినట్లు వెల్లడించారు. నిష్పాక్షికంగా
వ్యవహరించాల్సిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా
వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్
మహేశ్వరీని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని అజేయ
కల్లాం ఆరోపించారు. సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం తర్వాతనే
హైకోర్టులో పరిణామాలు మారిపోయాయన్నారు. చంద్రబాబు కోరుకున్నట్టుగా కొన్ని ముఖ్యమైన
కేసులన్నీ జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్
సోమయాజులు, జస్టిస్ రమేష్ బెంచ్కు మారిపోయాయని ఆరోపించారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపైనే ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా
సంచలనం రేపింది. తాజాగా, ఈ ప్రెస్మీట్ పెట్టినందుకు సీఎం జగన్పై చర్యలు
తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఇక విచారణ
జరగనున్నట్లు తెలుస్తుంది.