Advertisement

  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో కీలకాంశాలు ప్రస్తావించిన ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ప్రతినిధుల బృందం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో కీలకాంశాలు ప్రస్తావించిన ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ప్రతినిధుల బృందం

By: chandrasekar Sat, 29 Aug 2020 09:21 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో కీలకాంశాలు ప్రస్తావించిన ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ప్రతినిధుల బృందం


రాష్ట్రంలో వైస్సార్ పార్టీ కి ప్రధాన మరియు బలమైన ప్రతిపక్షంగా మారడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేబట్టింది. ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ప్రతినిధుల బృందం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో భేటీలో కీలకాంశాలు ప్రస్తావనకొచ్చాయి. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యల ఆధారంగా ఏపీ బీజేపీ ముందుకు పోతోంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు చర్చకొచ్చాయి. పార్టీ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు గురుంచి ప్రస్తావించారు.

అధికార పార్టీ మరియు టీడీపీ లను ఎదుర్కొని చేప్పట్టిన కార్యక్రమాలను గురుంచి కేంద్ర ప్రతినిధికి తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరించాక చేపట్టిన జిల్లా పర్యటన వివరాలు, ప్రస్తుత పరిస్థితులు, వరద ప్రాంతాల్లో బీజేపీ నేతల పర్యటన వివరాల్ని జేపీ నడ్డాకు ఏపీ బీజేపీ నేతలు వివరించారు. నడ్డాను కలిసినవారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జివిఎల్ నర్శింహారావు తదితర కీలకనేతలున్నారు. బీజేపీ ప్రస్తుతం ఓ ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతున్నవైనాన్ని జేపీ నడ్డాకు వివరించారు. ఏపీలో మిత్రపక్షం జనసేనతో కలిసి రాష్ట్రంలో అధికారంలో రావాలనే సంకల్పంతో పనిచేయాలని టీడీపీ, వైసీపీ అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా ఎదగాలని జేపీ నడ్డా సూచించారు.

Tags :

Advertisement