Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ఎమ్సెట్ ఫలితాలు వాయిదా పడింది

By: chandrasekar Fri, 09 Oct 2020 5:29 PM

ఆంధ్ర ప్రదేశ్ ఎమ్సెట్ ఫలితాలు వాయిదా పడింది


ఇంజినీరింగ్‌ మరియు అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల కోసం నిర్వహించబడ్డ ఎంసెట్ ఎంట్రన్స్ ఫలితాలు వాయిదా పడ్డాయి. ఏపీ ఎంసెట్‌ ఫలితాలువాయిదా పడ్డాయి. రేపు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, అధికారులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఫలితాలను మరో సారి జాగ్రత్తగా పరిశీలించాకే విడుదల చేయనున్నారు.

కరోనా వల్ల వాయిదా పడ్డ ఎంసెట్ పరీక్షలు సెప్టెంబ‌ర్ 17, 18, 21, 22 తేదీల్లో ఇంజినీరింగ్‌, సెప్టెంబ‌ర్ 23 నుంచి 25 వ‌ర‌కు అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌కోసం ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ప‌రీక్ష రెండు సెష‌న్ల‌లో జరిగింది. మొద‌టి సెష‌న్ ఉద‌యం 9 నుంచి 12 వ‌ర‌కు రెండో సెష‌న్ మ‌ధ్యాహ్నం 3 నుంచి 6 గంట‌ల‌వ‌ర‌కు జరిగింది. కంప్యూట‌ర్ ఆధారితంగా నిర్వ‌హించ‌నున్న ఈ ప‌రీక్ష‌ల కోసం 2,72,720 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం హాజరైన విద్యార్థులు ఫలితాలకోసం ఎదురుచూస్తున్నారు.

ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://sche.ap.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు.

ఫలితాల కోసం క్రింది లింక్ ఉపయోగించండి: https://sche.ap.gov.in/EAMCET/EamcetHomePages/Home.aspx

http://www.manabadi.co.in/Entrance-Exams/ap-eamcet-results-andhrapradesh-eamcet-results.asp

Tags :
|
|

Advertisement