Advertisement

బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

By: chandrasekar Tue, 21 July 2020 12:15 PM

బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పుష్కరవనం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని తప్పించబోయి బోల్తా పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంహైదరాబాద్ నుంచి జగదల్పూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు సారపాక సమీపంలో పుష్కరవనం వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనే బోల్తా పడింది.

అయితే బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో డ్రైవరుకు కూడా ఏమి కాలేదని తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో బయటకు తీశారు.

Tags :
|

Advertisement