బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
By: chandrasekar Tue, 21 July 2020 12:15 PM
భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పుష్కరవనం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని
తప్పించబోయి బోల్తా పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
దీనికి సంబంధించి
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంహైదరాబాద్ నుంచి
జగదల్పూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు సారపాక సమీపంలో
పుష్కరవనం వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనే
బోల్తా పడింది.
అయితే బస్సులో
ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో డ్రైవరుకు కూడా ఏమి
కాలేదని తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని బోల్తా
పడిన బస్సును క్రేన్ సహాయంతో బయటకు తీశారు.
Tags :
private |
travel |