Advertisement

  • సీఎం కు చల్లటి చపాతీలు పెట్టినందుకు అధికారి సస్పెండ్ ..

సీఎం కు చల్లటి చపాతీలు పెట్టినందుకు అధికారి సస్పెండ్ ..

By: Sankar Sun, 27 Sept 2020 07:42 AM

సీఎం కు చల్లటి చపాతీలు పెట్టినందుకు అధికారి సస్పెండ్ ..


ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదయినా ప్రాంతానికి పర్యటనకు వెళ్తే అక్కడ అధికారులు ఆయనకు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తారు..ఆయన కోరింది క్షణాల్లో ఆయన ముందు ఉంచుతారు..అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఓ అధికారి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండయ్యారు.

చపాతీల విషయంలో సదరు అధికారి సస్పెండ్ కావడం గమనార్హం. అయితే, ఆ విషయంలో సీఎం కలగజేసుకొని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. దీంతో ఆయన మళ్లీ తన బాధ్యతలు స్వీకరించారు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ అసలేంజరిగిందంటే..

పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి, ఆయన సిబ్బంది మొత్తానికి చక్కని ఆహారం అందించడం ఆ ప్రాంతపు ఫుడ్ సేఫ్టీ అధికారి విధి. ఇలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఇండోర్‌లో పర్యటించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న స్వామి అనే ఫుడ్ సేఫ్టీ అధికారి ఉన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో సీఎంకు పళ్లెంలో రోటీలు వడ్డించారు. అందరికీ అవే వడ్డించారు. అయితే, ఆ చపాతీలు చల్లగా ఉన్నాయి. చల్లగా ఉన్న చపాతీలు ఎలా వడ్డిస్తారని, విధులు సక్రమంగా నిర్వర్తించలేదన్న కారణంతో పై అధికారి స్వామిని సస్పెండ్ చేశారు.

తర్వాత ఈ విషయం సీఎం శివరాజ్‌ సింగ్‌కు తెలిసింది. దీంతో వెంటనే ఆయన్ను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. తాను కూడా అందరిలాంటి వ్యక్తినేనని చల్లగా అయిన చపాతీలు తినడాన్ని తాను అసలు పట్టించుకోబోనని సీఎం చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు అధికారిని సస్పెండ్ చేయకూడదంటూ ఉన్నతాధికారులకు సూచించారు

Tags :

Advertisement