Advertisement

  • అంఫన్ తుఫాన్ రోజున తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన ఆసక్తికర ఘటన

అంఫన్ తుఫాన్ రోజున తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన ఆసక్తికర ఘటన

By: chandrasekar Fri, 22 May 2020 3:11 PM

అంఫన్ తుఫాన్ రోజున తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన  ఆసక్తికర ఘటన


తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లిలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలోని కొన్ని ఇళ్లు అలల ధాటికి నాశనమయ్యాయి . ఈ క్రమంలో ఓ ఇంటి గోడల నుంచి వెండి నాణేలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. గ్రామంలో సుమారు 8 ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అందులో ఓ ఇంటి పునాది గోడ కూలిపోవడంతో.. అందులో వెండి నాణేలు బయటపడ్డట్టు చెబుతున్నారు. ఈ నాణేలు బ్రిటీష్ కాలానికి చెందినవి అని అంటున్నారు.

Tags :
|
|

Advertisement