ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి
By: chandrasekar Mon, 28 Sept 2020 6:29 PM
ఆదివారం ముంబై నుంచి
ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొన్న సంఘటన జరిగింది. ముంబై నుంచి ఢిల్లీకి పయనమైన ఇండిగో విమానానికి
ఊహించని పరిణామం ఎదురైంది. నింగిలోకి ఎగరిన కాసేపటికే ఓ పక్షి విమానానికి ఢీకొనడంతో వెంటనే తిరిగి ముంబైకి రావలసివచ్చింది.
ఆదివారం జరిగిన ఈ
ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరరూ ఊపిరి పీల్చుకున్నారు. 6E 5047 ఇండిగో విమానం ముంబై నుంచి ఢిల్లీకి పయనమైంది. ఈ క్రమంలో పక్షి ఢీకొనడంతో
మళ్లీ ముంబై తిరిగిరావలసి వచ్చింది. దీంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాన్ని
ఏర్పాటు చేసినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.
ఇందువల్ల ప్రయాణికులకు
కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. వాస్తవానికి
ఇండిగో విమానం ఉదయం 8.05 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ
విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమైనట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 8వ
తేదీన సైతం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
అదేవిధంగా ముంబైకి చెందిన
ఎయిర్ ఏసియా విమానం రాంచీ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకునే సమయంలో పక్షి ఢీకొట్టడంతో
వెనక్కి తిరిగిరావాల్సి వచ్చింది. దీంతో అప్పుడు కూడా ప్రయాణికుల కోసం ఎయిర్
ఏసియా సిబ్బంది ప్రత్యామ్నాయంగా విమానాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటనల్లో
ఎలాంటి నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.