గురువారం రాత్రి ఢిల్లీ పరిసర ప్రాంతాలలో భూకంపం
By: chandrasekar Fri, 18 Dec 2020 11:23 AM
గురువారం రాత్రి ఢిల్లీ
పరిసర ప్రాంతాలలో భూకంపం ఏర్పడింది. ఇక్కడ ఏర్పడ్డ భూకంప తీవ్రత 4.2 ఉన్నట్లు తెలిపారు.
ఇందుకోసం గురువారం రాత్రి 11.46 గంటలకు భూమి కంపించిందని తెలియజేసారు. కానీ దీనిపై
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రస్తుతం
ధృవీకరించలేదు.
ఈ వివరాలను ట్వీట్ ద్వారా
ప్రసార భారతి తెలిపింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలైన హర్యానాలో గల గురుగ్రామ్ నైరుతి
దిశలో 48
కిలోమీటర్ల దూరంలో 7.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు
తెలిపారు. ఇక్కడ ఏర్పడ్డ భూకంపం గురించి పూర్తి వివరాలు అందాల్సి వుంది.
కానీ ఇందుకోసం ఎలాంటి
ప్రాణ నష్టం మరియు ఆస్థి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. కొందరు సోషల్ మీడియా
ద్వారా ఘజియాబాద్లో కూడా భూమి కంపించినట్లు ట్వీట్ చేశారు. ఇందుకోసం నష్టాల
గురించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.