Advertisement

  • ముగ్గురు ప్రయాణిస్తున్న ఓ ఆటో వాగులో కొట్టుకుపోయింది...

ముగ్గురు ప్రయాణిస్తున్న ఓ ఆటో వాగులో కొట్టుకుపోయింది...

By: chandrasekar Mon, 21 Sept 2020 09:48 AM

ముగ్గురు ప్రయాణిస్తున్న ఓ ఆటో వాగులో కొట్టుకుపోయింది...


ఓ ఆటో వాగులో వికారాబాద్‌ జిల్లాలోని పెద్దేముల్ మండలం జయరామ్ తండా గ్రామం దగ్గర కొట్టుకుపోయింది. వాగులో కొట్టుకుపోయిన ఆటోను, దానిలో ఉన్న ముగ్గురిని గ్రామస్తులు కాపాడారు.

అందులో శంకర్‌పల్లి మండలం తెల్ల గూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాముడుతోపాటు మరో ఇద్దరున్నారు. గ్రామస్తులు ఎంత చెప్పినా వినకుండా వాగు దాటేందుకు వారు ప్రయత్నించారు. కొంతదూరం రాగానే ప్రవాహంలో ఆటో కొట్టుకుపోయింది.

దీంతో అక్కడే ఉన్న గ్రామస్తులు తాడుసాయంతో వారిని కాపాడారు. ఆటోను ఒడ్డుకు తీసుకువచ్చారు. కాగా, డ్రైవర్‌తోపాటు ఉన్న మరో ఇద్దరు కూడా మద్యంమత్తులో ఉన్నట్లు గ్రామస్తులు తెలియ చేసారు.

Tags :

Advertisement